టీడీపీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్లను నియమించింది. కడపతో పాటూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్లను నియమించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్గా రెడ్డప్పగారి మాధవీ ).. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్గా రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయులును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గుంటూరు పార్లమెంట్ ప్రత్తిపాటు (ఎస్సీ) నియోజకవర్గానికి, కడప నియోజకవర్గానికి ఇంఛార్జ్లను నియమిస్తున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
కడప అసెంబ్లీ నియోజకవర్గానికి మొన్నటి వరకు అమీర్బాబు ఇంఛార్జ్గా ఉన్నారు.. ఆయన స్థానంలో మాధవీరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అలాగే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి 2019 ఎన్నికల తర్వాత ఇంఛార్జ్ లేకుండా పోయారు. ఆ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు.. అప్పటి నుంచి అక్కడ పార్టీ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు.. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయులను నియమించారు.
తాజాగా ఇంఛార్జ్లను నియమించిన రెండు నియోజకవర్గాలు కీలకమైనవి. ప్రత్తిపాడు నుంచి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే కడప నియోజకర్గం నుంచి డిప్యూటీ సీఎం అంజాద్బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో టీడీపీ వరుసగా సమీక్షలు నిర్వహించి.. వీరికి బాధ్యతలు అప్పగించింది. కడప బాధ్యతలు అప్పగించిన మాధవిరెడ్డి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సతీమణి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa