గతనెల 18న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ లా విభాగం డీన్గా అదనపు అడ్వకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్గా అయన పనిచేస్తున్నారు. టీచింగ్ అనుభవం లేని వ్యక్తిని లా విభాగం డీన్గా నియమించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా నియామకం జరిపారని, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని పలువురు అధ్యాపకులు విమర్శిస్తున్నారు. టీచింగ్ ఫీల్డ్లో లేని న్యాయవాదిని లా విభాగం డీన్గా ఎలా నియమిస్తారని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa