ప్రభుత్వాన్ని విమర్శిస్తే సీఎం జగన్కు నచ్చక కేసులు పెడుతున్నారని, ఇప్పటికి తనపై 15 కేసులు పెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈనెల 1న విశాఖ విమానాశ్రయంలో అయ్యన్నను అరెస్టు చేసి 41 నోటీసు జారీచేయగా, వివరణ ఇచ్చేందుకు బుధవారం హనుమాన్ జంక్షన్ సర్కిల్ స్టేషన్లో ఆయన హాజరయ్యారు. గన్నవరం డీఎస్పీ జయసూర్య పర్యవేక్షణలో హనుమాన్జంక్షన్ సీఐ ఏఎన్.నరసింహమూర్తి లిఖిత పూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు అయ్యన్నను డీఎస్పీ విచారించారు. అరాచకపాలనను ప్రజలకు తెలియజెప్పకుండా ఉండలేమని, ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత అని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తే భయపడేదిలేదని, దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa