అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. దేవాలయం లాంటి అసెంబ్లీని ప్రతిపక్ష సభ్యులు కించపరిచారు. చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారని మండిపడ్డారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాలు విసిరారు. బాలకృష్ణ రీల్ హీరో.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని అభివర్ణించారు. అయితే, రీల్ హీరోలు సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు రూ.370 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయాడు అని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేశాడు కాబట్టి చంద్రబాబు దోచుకోవడానికి అర్హుడు అనేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సభలో చర్చ జరగకుండా టీడీపీ నేతలు ఎందుకు పారిపోతున్నారు? అని నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa