మన దేశంలో వినాయక నవరాత్రోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చివరి రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం చేస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గణేష్ విగ్రహాన్ని కలిగి ఉన్నాడు. దాని ఖరీదు అక్షరాలా రూ.600 కోట్లకు పైమాటే అని చెబుతున్నారు. ఇంత విలువైన గణనాధుడి విగ్రహాన్ని ఆ వ్యక్తి సంవత్సరంలో ఒక రోజు మాత్రమే బయటికి తీస్తాడు. దాన్ని చూసేందుకు జనం భారీగా తరలివస్తారు. ఈ వినాయకుడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో ఉంది.
సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా.. ఈ అత్యంత ఖరీదైన వినాయకుడిని కలిగి ఉన్నారు. అయితే ప్రతీ సంవత్సరం వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా కనుభాయ్ అసోదరియా ఈ గణేష్ విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ అత్యంత విలువైన గణపతిని వజ్రాలతో తయారు చేశారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే.. కనుభాయ్ అసోదరియా బయటకు తీస్తారు. అయితే ఆ రోజున ఆ వజ్ర గణపతిని చూసేందుకు భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు.
ఈ వజ్ర గణపతి పరిమాణంలో కోహినూర్ వజ్రం కంటే పెద్దదిగా ఉంటుందని దాన్ని చూసిన వారు చెబుతున్నారు. అయితే ఈ వజ్ర గణపతి ధరను కనుభాయ్ అసోదరియా చెప్పకపోయినా.. బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఈ వజ్ర గణపతి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని విశేషాలు ఏంటి అనే విషయాలను కనుభాయ్ అసోదరియా వెల్లడించారు. దాన్ని 15 ఏళ్ల క్రితం తన తండ్రి బెల్జియం దేశానికి వెళ్లి వ్యాపారం కోసం అక్కడి నుంచి కొన్ని ముడి వజ్రాలను తీసుకువచ్చారని తెలిపారు. అయితే అందులో వినాయకుడి ఆకారంలో ఒక వజ్రం ఉందని తన తండ్రికి ఒక కల వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. దీంతో బెల్జియం నుంచి తెచ్చిన వజ్రాలన్నింటినీ పరీక్షించగా.. అందులో ఒకటి అచ్చం గణపతి ఆకారంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి దాన్ని విక్రయించడం గానీ, దాని నుంచి ఇంకా వేరే వస్తువులు తయారు చేయడం గానీ చేయకుండా అలాగే ఉంచినట్లు కనుభాయ్ అసోదరియా తెలిపారు. అప్పటి నుంచి ఆ వజ్ర గణపతికి తమ కుటుంబ సభ్యులు పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఈ వజ్ర గణపతిని ఎవరికీ ఇవ్వనని.. విక్రయించనని కనుభాయ్ అసోదరియా వెల్లడించారు. ఆ వజ్ర గణపతి పూర్తిగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వజ్రమని తెలిపారు. అయితే ప్రత్యేక ఆకారంలో ఉన్న ఈ వజ్రానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కిందని కనుభాయ్ అసోదరియా చెప్పారు. ఈ డైమండ్ గణపతి ఫొటోలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, యోగా గురువు రామ్దేవ్ బాబా వంటి వారికి అందించినట్లు కనుభాయ్ అసోదరియా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa