ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. తన కుమారుడి మృతికి కారణమని ఓ తండ్రి ఫిర్యాదు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 08:44 PM

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కేసు నమోదైంది. ఆనంద్ మహీంద్రాతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 12 మంది ఉద్యోగులపైనా ఓ వ్యక్తి కేసు పెట్టాడు. తన కుమారుడు చనిపోవడానికి ఆనంద్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కారణం అంటూ ఆ వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. తాను కొనుగోలు చేసిన స్కార్పియో కారులో ఎయిర్‌బ్యాగులు లేవని.. దీంతో యాక్సిడెంట్ అయినపుడు తన కుమారుడు చనిపోయాడని ఆరోపించాడు. కారు భద్రతపై తప్పుడు హామీలు ఇచ్చిందని రాజేష్ మిశ్రా అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.


రాజేష్ మిశ్రా 2020 లో బ్లాక్ స్కార్పియోను తన కుమారుడు అపూర్వ్‌కు కొనిచ్చాడు. దాని విలువ అప్పుడు రూ. 17.39 లక్షలు. అయితే


2022 జనవరి 14 వ తేదీన రాజేష్ మిశ్రా తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్‌ వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా అపూర్వ్‌ వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపూర్వ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అయితే ఈ ఘటన తర్వాత జనవరి 29 వ తేదీన ఆ కారును మహీంద్రా సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి అందులో ఉన్న లోపాలను వారికి వివరించాడు. తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కాలేదని.. అసలు ఆ కారులో ఎయిర్ బ్యాగులు లేవని ఆరోపించాడు. మహీంద్రా కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఎయిర్‌బ్యాగులు బిగించలేదని.. కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందని రాజేష్ మిశ్రా చీటింగ్ కేసు పెట్టాడు.


ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఉద్యోగులతో మాట్లాడేందుకు వెళ్లగా.. వారు తనను తిట్టారని.. చంపేస్తామని బెదిరించారని రాజేష్‌ మిశ్రా కేసు నమోదు చేశారు. మోసం, వాహనాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం సహా మరిన్ని సెక్షన్ల కింద ఆనంద్ మహీంద్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్నానీతో పాటు మొత్తం 14 మందిపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa