చైనా పరిశోధనల నౌక షియాన్ 6ను తమ ప్రాదేశిక జలాల్లోకి అనుమతించబోమని శ్రీలంక స్పష్టం చేసింది. తమకు భారత భద్రత ఆందోళనలే ముఖ్యమని లంక ఉద్ఘాటించింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ సోమవారం ప్రకటించారు. కొలంబో, హంబన్టోట్ నౌకాశ్రయాలకు చైనా నౌక షి యాన్ అక్టోబరులో చేరుకోనుందనే వార్తలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర భద్రత విషయంలో భారత్ పలుమార్లు శ్రీలంకతో తన ఆందోళనలను పంచుకుంది. తాజాగా, ఈ అంశంపై శ్రీలంక స్పష్టతనిచ్చింది. షి యాన్ 6 నౌక అక్టోబర్లో శ్రీలంక పోర్టుకు రానుందన్న నివేదికలు, దానిపై భారత్ ఆందోళన గురించి అలీ సబ్రేను ప్రశ్నించగా.. తమకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఉందని, భారత్ సహా చాలా మంది స్నేహితులను సంప్రదించామని సమాధానం ఇచ్చారు.
‘ఇది కొంత కాలంగా జరుగుతున్న చర్చ... భారతదేశం చాలా కాలంగా తన ఆందోళనలను వ్యక్తం చేసింది.. కానీ మేము ప్రామాణిక ఆపరేటింగ్ విధానంతో బయటకు వచ్చాం.. దానిని రూపొందించినప్పుడు భారత్ సహా మా స్నేహితులను సంప్రదించాం.. కాబట్టి అది ఎస్ఓపీకి కట్టుబడి ఉన్నంత వరకు మాకు ఎటువంటి సమస్య లేదు. కానీ దానికి అనుగుణంగా లేకపోతే ఇబ్బంది’అని అలీ సబ్రీ ఏఎన్ఐతో చెప్పారు. అంతేకాదు, చైనా నౌకకు తాము అనుమతి ఇవ్వలేదని, దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ‘నాకు తెలిసినంత వరకూ మేము చైనా నౌక అక్టోబరులో శ్రీలంకలో ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు.. సంప్రదింపులు జరుగుతున్నాయి.. మాకు భారత భద్రత ఆందోళలు మాకు చాలా ముఖ్యం.. మా ప్రాంతాన్ని ఎల్లప్పుడూ శాంతియుతంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం’ అని లంక మంత్రి చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్ఓపీ ఆధారంగా విదేశీ నౌకలకు అనుమతిస్తామని తెలిపారు.
శ్రీలంక స్థానిక పత్రిక కథనం ప్రకారం.. చైనా నౌన షి యాన్ అక్టోబరులో కొలంబో, హంబన్టోట్ పోర్టులకు అక్టోబరులో వచ్చే అవకాశం ఉందని, నేషనల్ అక్వాటిక్ రిసోర్సెస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీతో కలిసి అధ్యయనం చేపట్టనుంది. శ్రీలంక విదేశాంగ మంత్రితో సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా న్యూలాండ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ఎస్ఓపీని అనుసరించి విదేశీ నౌకలు, విమానాలను తమ భూభాగంలో కార్యకలాపాలకు అనుమతిస్తామని ఈ సందర్భంగా సబ్రీ చెప్పినట్టు మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా, గతేడాది చైనా గూఢచారి నౌక యువాన్ వాంగ్-5ను శ్రీలంక జలాల్లోకి ప్రవేశించడపై పట్ల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. భారత భద్రతపై ప్రభావం చూపే ఏవైనా పరిణామాలు స్పష్టంగా మాకు ఆసక్తిని కలిగిస్తాయని అన్నారు. 9వ ఇండియా-థాయ్లాండ్ జాయింట్ కమీషన్ మీటింగ్ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa