ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కన్నుమూశారు.హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం నరేంద్ర మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆగిరిపల్లిలో శనివారం రాత్రి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. అర్ధరాత్రి దాటడంతో ఊరేగింపులో డీజే ఆపేయాలని కానిస్టేబుల్ గంధం నరేంద్ర సూచించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఉలాస రామకృష్ణ.. కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కానిస్టేబుల్ ఒంటరిగా ఉన్న సమయంలో అతడి తలపై కర్రతో దాడి చేశాడు. కానిస్టేబుల్ సురేంద్రం అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆగిరిపల్లి ఎస్సై అక్కడకు చేరుకుని సురేంద్రను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కానిస్టేబుల్ చనిపోయారు. దాడి చేసిన నిందితుడు రామకృష్ణ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సురేంద్ర మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa