ప్రస్తుతం జనసేనాని వారాహి యాత్ర కృష్ణాజిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం పెడనలో బహిరంగ సభ జరగనుంది. అయితే మంగళవారం మచిలీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెడనలో జరిగే సభలో రాళ్లు, కత్తులతో దాడి చేసే అవకాశం ఉందని, 2 వేల మంది గూండాలను, క్రిమినల్స్ను పబ్లిక్ మీటింగ్లోకి దింపి అల్లర్లు సృష్టించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కత్తులు, కటార్లు తెచ్చేవారిని జనసైనికులు గమనించి పోలీసులకు అప్పగించాలని సూచించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కృష్ణాజిల్లా పోలీసులు పవన్కల్యాణ్కు నోటీసులు జారీ చేశారు. ఆధారాలుంటే ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో పెడనలో పొలిటికల్ హీట్ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa