ఇన్నాళ్లూ నిప్పు అని, సచ్ఛీలుడినని చెప్పుకుంటూ తిరిగిన చంద్రబాబు స్కిల్ స్కాంలో రూ. 371 కోట్లు కొట్టేసి, చట్టానికి అడ్డంగా దొరికిపోయాడని, బాబును ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి జైలుకు పంపితే.. ఆ ఫ్రస్ట్రేషన్లో టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు నారమల్లి పద్మజ అన్నారు. టీడీపీ నేతల వికృత చేష్టలు, మాటలు పరాకాష్టకు చేరాయని, ఇందులో భాగంగానే మంత్రి రోజాపై టీడీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతూ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మాట్లాడిన మాటలకు ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని, బండారు నీచ మాటలను సమర్థిస్తున్న నారా లోకేష్, పవన్ కల్యాణ్లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. మహిళలైన నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరీలు బండారు వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని, ఒక మహిళా మంత్రి రోజా కన్నీళ్లు చూసి ఆనందపడుతున్నారా? అని ప్రశ్నించారు. బ్రాహ్మణి, భువనేశ్వరి అసలు మహిళలేనా..? కనీసం మనుషులేనా..? అని అనిపిస్తుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నారమల్లి పద్మజ విలేకరుల సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa