ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 06:33 PM

ఏపీలో విభిన్నమైన వాతావరణం ఉంది. ఓవైపు ఎండ తీవ్రత ఉంటే.. మరోవైపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తున్నాయి. అయితే ఆదివారం నాడు కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోసతారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.


మరోవైపు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండాకాలంలో వేడి వాతావరణం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శనివారం నెల్లూరులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, దక్షిణ చత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఏజెన్సీ ప్రాంతంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాయువ్య గాలుల ప్రభావం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. అక్టోబర్ నెలలో వానలకు బదులుగా ఎండ తీవ్రత ఉండటం విచిత్రంగా ఉంది. అది కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా.. ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నెలలో వర్షాలు ఉంటాయా లేదా అన్న సందేహం కలుగుతోంది. అయితే పగలు ఎండల తీవ్రత ఉంటే.. రాత్రిళ్లు మాత్రం వాతావరణం కాస్త చల్లబడుతోంది. వేకుజామున సమయంలో కాస్త చలి వాతావరణం అనిపిస్తోందని జనాలు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa