ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైలవరంలో కల్తీ ఆయిల్ దందా,,,సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 06:37 PM

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కల్తీ నూనె వ్యాపారం బయటపడింది. నూజివీడు రోడ్డులోని ఒక మిల్లు ఆవరణలో కల్తీ నూనె తయారుచేసి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు. అప్పటికే తరలించేందుకు సిద్ధంగా ఉన్న డబ్బాలను గుర్తించారు.. స్థానికులు కూడా వెళ్లి ప్రశ్నించారు. ఈలోపు రెవెన్యూ సిబ్బంది వస్తున్నారని తెలుసుకున్న ఆ మిల్లు యజమాని కొన్ని డబ్బాలలో నూనెను పారబోశాడు. అక్కడ దుర్వాసన వస్తుండటంతో అధికారులు పరిశీలించి వివరాలు సేకరించారు. కల్తీ వంట నూనెను స్థానికంగా కొన్ని చిన్న చిన్న టిఫిన్‌ సెంటర్లు, బేకరీలు, సమోస వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.


స్థానికులు ఈ కల్తీ ఆయిల్ దందా గురించి అధికారులకు వివరించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది కల్తీ నూనె తయారు చేస్తున్న వ్యక్తిని తహసీల్దారు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది కల్తీ నూనె నిర్థారణ చేయాలని జిల్లా ఫుడ్‌ కంట్రోలర్‌కు పంపారు. స్థానికుల సమాచారం మేరకు కల్తీ నూనె తయారుదారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తహసీల్దార్ చెప్పారు. స్వాధీనం చేసుకున్న కల్తీ నూనె డబ్బాలను పరిశీలన నిమిత్తం పుడ్‌ కంట్రోల్‌ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇక్కడ వాడిన డబ్బాలు సేకరించి కల్తీ నూనె నింపుతూ విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa