ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ తెరపైకి అమరావతి అసైన్డ్ భూముల కేసు..ఏపీ హైకోర్టులో సీఐడీ పటిషన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 07:09 PM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇప్పటికే స్కిల్, ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులు వెంటాడుతున్నా సంగతి తెలిసిందే. తాజాగా మరో కేసు కూడా తెరపైకి వచ్చింది.. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై సీఐడీ ఫోకస్ పెట్టింది ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా.. కోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.. అయితే ఈ కేసులపై విచారణ రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్లలో కోరింది. అయితే అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ హైకోర్టుకు చంద్రబాబు, నారాయణ లాయర్లు తెలిపారు. దీంతో కోర్టు విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.


అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగింది అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు 2021 మార్చి 12న సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ కేసు విచారణపై 2021 మార్చి 19న హై కోర్టు స్టే ఇచ్చింది.. అలాగే ఈ కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్ మీద విచారణ పూర్తవగా అక్టోబర్ 16 తేదీకి తీర్పును వాయిదా పడింది. ఈ క్రమంలోనే అసైన్డ్ భూముల కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ కోర్టును ఆశ్రయించింది. సోమవారం తీర్పు రానున్న సమయంలో సీఐడీ పిటిషన్‌లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa