విజయవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. సోమవారం (రెండో రోజు) అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హ్రుదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆరోగ్యం, సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం పొందుతారు. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్నారు. గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దుర్గగుడికి తరలివస్తున్నారు. మరోవైపు ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు లక్షన్నర మందికి పైగా భక్తులు తొలిరోజే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో కనిపించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తుల రద్దీ ఏమాత్ తగ్గలేదు. దుర్గమ్మ తొలిరోజు బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa