బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత్, పాక్ రెండు దేశాలుగా విడిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వేర్పాటు వాదంతో ఉగ్ర దాడులు, ఉగ్రవాద శిబిరాలు నిత్యం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దేశ విభజన నుంచి అనేక హిందూ ఆలయాలపై ఎన్నోసార్లు దాడులు, మూసివేతలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలో ఉన్న కాశ్మీర్ లోయలోని కాశ్మీర్ శక్తి పీఠంలో తొలిసారి శారదా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కేవలం అర కిలో మీటర్ దూరంలోని కుప్వారా జిల్లా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదా మాత ఆలయం ఉంది. స్థానికంగా ఉన్న కథనాల ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ శారదా మాత ఆలయంలో నవరాత్రి పూజలు ఎన్నడూ నిర్వహించలేదని తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం అక్కడ అంగరంగ వైభవంగా శారదా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ శారదా మాత ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతుంటారు. ఈ శారదా ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణిస్తారు.
2019 లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో కొంత శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే కాశ్మీర్లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే భవిష్యత్లో కుప్వారాలోని ఈ శారదా మాత దేవాలయానికి మరింత ఆదరణ దక్కుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమైందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ను పర్యాటకంగా మరింత అభివృ్ధి చేయాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa