ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖతార్ ప్రభుత్వం వారిని విడుదల చేయాలి.. విశాఖ బీచ్‌ రోడ్డులో భారీ వాక్‌థాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 29, 2023, 07:11 PM

ఖతార్‌లో నిర్బంధానికి గురై మరణశిక్ష విధించబడిన ఎనిమిది మంది నేవీ మాజీ ఉద్యోగులకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ఎనిమిది మంది వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైజాగ్ బీచ్‌ రోడ్డులో ఆదివారం ఉదయం వాక్ థాన్ నిర్వహించారు. పార్క్ హోటల్ నుంచి ఉడా పార్క్ వరకు ఈ వాక్ థాన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో నేవీ మాజీ ఉద్యోగులు, విశాఖకు చెందిన సుగుణాకర్ పాకాల స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. ఖతార్ ప్రభుత్వం మరణ శిక్ష విధించిన వారిలో సుగుణాకర్ కూడా ఉన్నారు.


బెస్ట్ ప్రవాస భారతీయ ఎంప్లాస్ అవార్టు పొందిన వారిపై మరణశిక్ష విధించడం దారుణమని.. వారిని వెంటనే విడుదల చేసేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. ఉపాధి కోసమే కాకుండా దేశ ప్రతిష్ఠ నలమూలల చాటే విధంగా అనేక మంది మాజీ ఉద్యోగులు విదేశాల్లో పని చేస్తున్నారని.. అలాంటి వారికి ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఖతార్‌తో భారత ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో వారిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలి కోరారు. ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. ఈ తీర్పు గురించి ఖతార్‌ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. వారిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa