పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పెద్ద మనసు చాటుకున్నారు. యలమంచిలి మండలం పెనుమర్రుకు చెందిన లక్ష్మీభవానీ ప్రసవ వేదనతో ఉండగా కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి పాలకొల్లు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో గైనకాలజిస్టు అందుబాటులో లేరని సిబ్బంది వేరేచోటకు వెళ్లాలని సూచించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక కుటుంబసభ్యులు అయోమయస్థితిలో ఉండిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ సమయంలో ఆసుపత్రికి వచ్చారు. ఎమ్మెల్యే బయటి నుంచి గైనకాలజిస్టు, మత్తు వైద్యుడిని రప్పించి వైద్యసేవలు అందేలా చేశారు. లక్ష్మీభవాని పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఎమ్మెల్యే చేసిన సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి బిడ్డలను చూసి 'మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని' రామానాయుడు అన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ పేదలకు పక్కాగా వైద్య సేవలందించాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు పడకేశాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa