ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్ వల్లే తెలంగాణ ఏర్పాటు,,,,మంత్రి కేటీఆర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 29, 2023, 08:23 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంటుంది. పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవర్చేలేదని బీఆర్ఎస్ చెబుతుండగా.. మా రాష్ట్రానికి వచ్చి హామీల అమలు తీరుతెన్నులు చూడాలని అక్కడి నేతలు అంటున్నారు.


ఈ నేపథ్యంలో శనివారం మీట్‌ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్‍‌ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి ఓటేస్తే.. రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్‌ చెత్తబుట్టలో పడేసిన పార్టీని.. స్వాతంత్య్రానంతరం దానిని రద్దు చేయాలని గాంధీజీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో కలిపి కాంగ్రెస్‌ చేసిన పాపం వల్ల తెలంగాణ 58 ఏళ్లు నష్టపోయిందని చెప్పారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కూడా మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేందుకు సిద్ధమైందని అన్నారు.


2009లో వైఎస్ మరణాంతరం ఉమ్మడి ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, వైఎస్ తనయుడు జగన్ వైఎస్సాఆర్‌సీపీ పార్టీ పెట్టడంతో అక్కడ కుప్పకూలిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయన్న ఆశతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎన్నో మార్పులు చేసి చూపించామని అన్నారు. గతంలో గుజరాత్‌, బెంగాల్‌ వంటి అనేక నమూనాలు ఉన్నప్పటికీ.. ఇప్పుడంతా తెలంగాణ నమూనానే నడుస్తోందన్నారు.


తెలంగాణ ఆచరించిందే దేశం మొత్తం అనుసరిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీలో హైదరాబాద్‌ బెంగళూరును మించిపోయిందని.. భగీరథ, మిషన్‌ కాకతీయ.. సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం సాధించిందని.. ఇవాళ హైదరాబాద్‌లో గుడుంబా గబ్బు.. జూదం క్లబ్బులు లేవన్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని తమ పార్టీ అధినేత కేసీఆర్ మూడోసారి సీఎం కావటం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa