శీతాకాలం మొదలైంది. దీంతో పెదవులు పగలడం, పొడిబారిపోవడం జరుగుతూనే ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో అయిదారు చుక్కల తేనె కలిపి రాత్రి పడుకోబోయే ముందు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. వేడినీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురద తగ్గుతుంది. టీ స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడు చందనం కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపు తేలుతుంది.