పేదల కష్టాలు తెలుసుకునేందుకు వేసిన తొలి అడుగుకు ఆరేళ్లు పూర్తయ్యాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి నేటి (సోమవారం)తో ఆరు వసంతాలయ్యాయి. 2017 నవంబరు 6వ తేదీన వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ పాదయాత్ర సాగించారు.. 134 నియోజవర్గాల్లో 341 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు.. 3,648 కిలోమీటర్లు నడిచారు. 2,516 గ్రామాల గుండా పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలు.. ఇంకా ఎందరితో మమేకం అయ్యారు.. దారిలో రైతులను పరామర్శించారు.. పొలాల్లోకి వెళ్లి.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.. తమ ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.. అందుకు అనుగుణంగా.. 2019 ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చారు.. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ ప్రణాళికను రూపొందించారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిపించారు ప్రజలు.. అసెంబ్లీలోనే కాదు.. పార్లమెంట్ స్థానాల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa