వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ.... 2014–19 మధ్యలో చంద్రబాబు పాలనను, 2019–23 నవంబర్ వరకు జగనన్న పాలనను ఒక్కసారి బేరీజు వేసుకోండి. రాష్ట్రంలో అవ్వాతాతలు రూ.2,750 పింఛన్ తీసుకుంటున్నారు. వచ్చే జనవరి నుంచి రూ.3 వేలు అందుకోబోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నాడు వైయస్సార్, నేడు సీఎం జగన్. 2014–19 వరకు చంద్రబాబు ఇచ్చిన పింఛన్లు 30 లక్షలు. ఈరోజు 64 లక్షల మందికి జగనన్న పింఛన్లు ఇస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ 30 శాతానికి చంద్రబాబు తగ్గించారు. ప్రజల్ని మోసం చేశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రుణాలు కట్టొద్దని, మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశాడు. కానీ జగనన్న నాలుగు విడతల్లో మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. చెప్పిన ప్రతి మాటా నెరవేర్చిన నాయకుడు జగనన్న. ఎన్నికల కోసమే వాగ్దానాలిచ్చే వ్యక్తి చంద్రబాబు. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆత్మగౌరవం నింపిన జగనన్న. టీడీపీ హయాంలో ముగ్గురు ఎస్సీ మంత్రులుంటే నేడు జగనన్న ఐదుగురు ఎస్సీలకు అవకాశం కల్పించారు. ఎస్టీలకు చంద్రబాబు ఐదేళ్లలో మంత్రి పదవే ఇవ్వలేదు. ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవులిచ్చిన జగనన్న. సీఎం జగన్ ఏ విధంగా పింఛన్లు పెంచారో, అంచలంచెలుగా తాము కూడా పెంచుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోనే అత్యుత్తమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగనన్న. ప్రతి ఒక్కరూ చదువుకునేందుకు అవకాశం కల్పించిన జగనన్న అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఈ సంక్షేమ పాలన ఇక్కడితో ఆగకూడదు. 2024 తర్వాత కూడా కొనసాగాలి అని ఆశాభావం వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa