ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ జిల్లా తాళ్లరేవులో ఘోర రోడ్డు ప్రమాదం,,,బైక్, ట్రాక్టర్ ఢీ.. ముగ్గురి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 13, 2023, 05:53 PM

కాకినాడ జిల్లా తాళ్లరేవులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌.. ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రమాదానికి గురైన బైక్ మీద నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. బైక్ అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలం బైపాస్ సమీపంలో సోమవారం (నవంబర్ 13) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను రచ్చవారిపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. తమ వారిని కోల్పోయి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితులందరూ పెయింటర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. యానాం నుంచి తాళ్లరేవు వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ లారీ.. బైకుల మీదకి దూసుకొచ్చింది. ఓ బైక్‌ను సుమారు 20 కి.మీ. దూరం ఈడ్చుకెళ్లింది. ఆదివారం రాత్రి కొంత మంది తమ ద్విచక్ర వాహనాలను కొయ్యలగూడెం వద్ద హైవే పక్కన ఓ హోటల్ దగ్గర నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో అటుగా వేగంగా వచ్చిన లారీ.. బైక్‌లపైకి దూసుకొచ్చింది. ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఓ యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ కింద ఇరుక్కొని 20 కి.మీ. దూరం వెళ్లిన బైక్‌ తుక్కు తుక్కుగా మారింది. కొయ్యలగూడెం పోలీసులు ఇచ్చిన సమాచారంతో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. కొయ్యలగూడెం నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలోని దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద పోలీసులు లారీని అడ్డగించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa