ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల ఘాట్ రోడ్డులో కొండను ఢీకొట్టిన తమిళనాడు కారు,,,,నలుగురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 13, 2023, 05:58 PM

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా అదుపుతప్పిన కారు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు గాయాలు కాగా.. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భక్తులు తమిళనాడు నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి కొండపై నుంచి బయల్దేరగా.. మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఓ ఎలక్ట్రిక్ బస్సు కూడా బోల్తాపడింది.. అయితే ఈ ఘటనల్లో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదాలతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. అవసరమైన చోట ముందస్తు హెచ్చరికల బోర్డుల్ని ఏర్పాటు చేసింది. అలాగే మహా శాంతి హోమం నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ప్రమాదాలు పెద్దగా జరగలేదు.. తాజాగా జరిగిన ప్రమాదంలో కూడా భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa