కులగణన వలన రాష్ట్రంలో 145 బీసీ, 58 ఎస్సీ, ఎస్టీ కులాల వారికి సముచితమైన న్యాయం చేకూరుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆధ్వర్యంలో బృందావనం ఫంక్షన్ హాల్లో కులగణన సర్వేకు సంబంధించి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమంలో.... శాసనసభాపతి తమ్మినేని సీతారాం, నరసన్న పేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చరిత్రాత్మకమైన నిర్ణయంతో కులగణనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. స్వాతంత్ర్యం రాకపూర్వం కుల గణన జరిగిందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాభా గణన జరిగింది, తప్ప కులగణన జరగలేదన్నారు. కుల గణన చేపట్టాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన జరగలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa