ఏపీ సీఐడీ నమోదు చేసిన ఫైబర్నెట్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. మొత్తం రూ.114 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తుల అటాచ్మెంట్కు సంబంధించి గతంలో సీఐడీ వేసిన పిటిషన్పై మంగళవారం ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు తీర్పు వెలువరించారు. తుమ్మల గోపీచంద్ (ఏ11), ఆయన సతీమణి తుమ్మల పవన దేవి, ఆయన ఎండీగా ఉన్న టెరాసాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థ ఆస్తులు, కనుమూరి కోటేశ్వరరావు (ఏ23)తో పాటు ఆయన డైరెక్టర్గా ఉన్న నెప్టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ సంస్థ ఆస్తులు జప్తు చేయాలని సీఐడీ కోరింది. గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్లలో నిందితులకు చెందిన రూ.114 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని విన్నవించింది. శుక్రవారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వాదనలు వినిపించారు. నిధుల దుర్వినియోగ ఆరోపణ 2014నాటిది అయితే అంతకు ముందున్న ఆస్తులను ఎలా జప్తు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దుర్వినియోగం అయిన నిధుల మొత్తానికి విలువచేసే ఆస్తులను జప్తు చేసే అధికారం న్యాయస్థానానికి ఉందన్నారు.. ఈమేరకు సీఐడీ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించారు. ఈ ఫైబర్ నెట్ వ్యవహారంలో కూడా చంద్రబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa