ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 12:33 PM

కాకినాడలో కొలువై ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసంలో ఏకాదశి పర్వదినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయంలోని క్యూ లైన్లు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. తె.జా. 2 గంటల నుంచే వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు తిరుమలలో ఈ నెల 24న సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 4.45 గంటల నుంచి తిరుమాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa