తమ పాలనలో అబివృద్ధి లేదు.. సంక్షేమం లేదు అని టీడీపీ నాయుకులు అంటున్నారని, ఇక్కడ జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సవాల్ విసిరారు. సీఎం జగన్ ప్రజలను మనసుతో చూసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగ పదవులు, రాజ్యాధికారం ఇస్తున్నారని వివరించారు. గిరిజన ప్రాంతం కోసం 3 లక్షల ఎకరాలకు పైగా భూమిని నాలుగున్నరేళ్లలో జగన్ ఇచ్చారని, చంద్రబాబు 14 ఏళ్లపాలనలో కనీసం 40 వేల ఎకరాల భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గిరిజనుల అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు, జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న అంశాన్ని ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా రుణాల పేరిట తల్లిని, చెల్లిని, అక్కని కూడా మోసం చేసిన చంద్రబాబు, ఆయన పార్టీ మళ్లీ కావాలా.., నిరుద్యోగులకు కూడా నమ్మించి నిలువునా ముంచేసిన చంద్రబాబు అవసరమా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం జగన్ సీఎం కాగానే రెండుల లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చారని గుర్తు చేసారు. టీడీపీ గత మోసాలు గుర్తు చేసుకో.. ఫ్యాన్ గుర్తును గుర్తు చేసుకుని జగన్ ను సీఎం మళ్లీ చేసుకోవాలని కోరారు. అన్నదమ్ములారా.. అక్కచెల్లెల్లులారా కలసిరండి.. అనే పాటను పీడిక రాజన్నదొర స్టేజి మీద పాడి వినిపించగా ప్రజల నుంచి విశేష స్పంద లభించింది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa