ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక విప్లవంతో సాధికారతను జగన్ సాదించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 25, 2023, 11:38 AM

సామాజిక విప్లవం తీసుకురావడం ద్వారా  జగన్ సామాజిక సాధికారత సాధించారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దేశంలో ఏ రాజకీయకుడు ఆలోచన చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని వివరించారు. నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక నిజం మాత్రమే పని చేస్తోందని, అదే జగన్ అని వివరించారు. గతంలో మాయ మాటలతో అబద్ధాలతో పాలన చేసారని, అ  అబద్ధమే చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. సీఎంగా ప్రమాణం చేసిన నాడు చంద్రబాబు 5 సంతకాలు చేసాడని, వాటిలో వేటినీ అమలు చేయలేదని, చంద్రబాబు అనే గజదొంగ వెనుకబడిన వర్గాలను మోసం కక్ష తీర్చుకున్నాడని, జగన్ మాత్రం రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు రావాల్సిన రాజ్యాధికారాన్ని అయా వర్గాలకు చేరువ చేసారన్నారు. ఉద్యోగాలు కల్పన, ఇళ్ల మంజూరు, భూమి పంపిణీ చేసినా సరే అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ నిజమైన రాజకీయ నాయకుడు అయితే తెలంగాణలో బర్రెలక్క ఇండిపెండింట్ గా పోటీ చేస్తున్న తరహాలో రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం రూపురేఖలు మారిపోనున్నాయన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa