వైసీపీ నేతలు చేపట్టిన సామజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..... బీసీ డిక్లరేషన్ చేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేస్తానని జగనన్న చెప్పాడు. చెప్పింది చెప్పినట్టే చేసి చూపించారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కేబినెట్లో అణగారిన వర్గాలకు పెద్దపీట వేయలేదు. ఆ ఘనత జగనన్నదే. 70శాతం వరకు ఆయా వర్గాలవారికే పదవులు అప్పగించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెద్దపీట వేశారు సీఎం జగనన్న. నామినేటెడ్ పోస్టులతో పాటు, నామినేషన్ పనుల్లోనూ ప్రాధాన్యత నిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర బాబుది. మైనార్టీలను చులకన చేసిన దుర్మార్గం చంద్రబాబుది. పార్టీలను, కులాలను,మతాలను, ప్రాంతాలను పట్టించుకోకుండా, అర్హులైనవారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్న సీఎం జగన్ ఆదర్శప్రాయుడు. తన వర్గం, తనవారి బాగు కోసమే పనిచేసిన కుత్సిత స్వభావి చంద్రబాబు. సామాజిక సాధికారతను సాకారం చేసి బడుగు, బలహీనవర్గాల ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్న మనసున్న నాయకుడు.. వైఎస్.జగన్మోహన్రెడ్డి అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa