చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్మెన్ సుజిత్ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్ప్రెస్కు సోమవారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 9.30 గంటల సమయంలో ఈ రైలు చిత్తూరు నుంచి తిరుపతికి బయల్దేరింది. అదే సమయంలో ట్రాక్మెన్ పట్టాలు పరిశీలిస్తున్నారు.
కొత్తకోట సమీపాన విరిగిన పట్టాను గమనించి వెంటనే ఎర్రజెండా చూపుతూ రైలుకు ఎదురుగా పరుగు తీశారు. అతడిని గమనించిన డ్రైవర్ వెంటనే రైలు నిలిపేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన వచ్చి విరిగిన పట్టాకు మరమ్మతు చేశారు. దీంతో రైలు దాదాపు 45 నిమిషాలు అక్కడే నిలిచిపోయింది. స్టేషన్ లేనిచోట రైలు హఠాత్తుగా ఆగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చలికాలంలో రైలు పట్టాలకు పగుళ్లు రావడం సాధారణమేనని సిబ్బంది పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa