ఈనెల 30న (గురువారం) ముఖ్యమంత్రి వైయస్ జగన్ నంద్యాల, వైయస్ఆర్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం వైయస్ఆర్ కడప జిల్లాలోని పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరవుతారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa