ఇంతకాలంగా అభివృధ్దికి నోచుకోని కుటుంబాలు మన ప్రభుత్వంలో హాయిగా జీవించేలా భవిష్యత్పై సీఎం జగన్ ఆశలు కల్పించారని అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అయన మాట్లాడుతూ.... అన్ని వర్గాలకూ అధికారం కట్టబెట్టడం మొదలు పెట్టిన సీఎం జగన్. గత ప్రభుత్వంలో ముస్లింలకు, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వలేదు. వాళ్లు మనుషులు కాదా? కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత ఇంటి ఇల్లాలిదే అని భావించిన సీఎం జగన్. అన్ని సంక్షేమ కార్యక్రమాలకూ ఇంటి ఇల్లాలినే యజమానిగా చేశారు. పేదల ఆకలి తీర్చి, కన్నీరు తుడిస్తే చంద్రబాబు ఈ డబ్బంతా వృథా అంటున్నాడు. వీరిని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు సీఎం జగన్ మనకు దొరికాడు. ఎవరిని ఆదరిస్తాం? ఆలోచించాలి. ప్రతిసారీ అబద్ధం ఆడి బీదలకు సాయమే తప్పు అన్న వ్యక్తిని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామా? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa