రానున్న ఎన్నికల్లో టీడీపీ నాయకులు డబ్బులిచ్చి ఓట్లు అడుగుతారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి చెప్పడం ఆయన ఓటమి భయాన్ని తెలియచేస్తున్నదని కోవూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పోలంరెడ్డి దినేష్రెడ్డి అన్నారు. దినేష్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఎమ్మెల్యే 170 మంది అసైన్డ్ భూముల పట్టాలిచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, గత ప్రభుత్వంలో తాము 6000 ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలందించామన్నారు. ఈ నెల 14న అమరావతిలో జరిగే సర్పంచుల సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందచేయనున్నామని సర్పంచుల సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెముకుల చైతన్య, చెముకుల శ్రీనివాసులు యాదవ్, ఇంతా మల్లారెడ్డి, గరికపాటి రాజేంద్రకుమార్ , తాతా బాల, పాటూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa