వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... జగనన్న నిరంతరం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారు. అట్టడుగువర్గాల పిల్లల కోసం, పేద పిల్లల కోసం.. వారి ప్రాథమిక విద్య నుంచే లబ్ది చేకూరేలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు జగనన్న. ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి అభివృద్ధి చేశారు.ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశ పెట్టి, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా నాణ్యమైన విద్యను అందించారు. ఎన్నెన్నో హామీలిచ్చి.. ఏ ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు. ఆయన మోసాలు అందరికీ తెలుసు. ఆయనను నమ్మితే నిండా మునిగినట్టే. ఇక్కడ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అరాచకాలు, దోపిడీల గురించి ఎంత చెప్పినా తక్కువే. అభివృద్ధి, సంక్షేమం విషయంలో జగనన్నతో పోటీపడేవారే లేరు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa