టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.. రైతుల్ని అడిగి పంట నష్టంపై ఆరా తీశఆరు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో పర్యటించారు. అంతకముందు మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు దగ్గర రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టం అంచనాకు రాలేదని చంద్రబాబు ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని.. అందుకే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారన్నారు చంద్రబాబు. తన పర్యటన ఖరారైతే తప్ప జగన్లో కదలిక రాలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa