టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన 2వ టీ20 మ్యాచ్లో సూర్య 36 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. దీని ద్వారా టీ20 క్రికెట్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా క్రికెట్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఇద్దరూ 56 టీ20 ఇన్నింగ్స్ల ద్వారా 2000 పరుగులు పూర్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa