జనసేన నేత నాదెండ్ల మనోహర్పై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అమర్నాథ్కు విలువలు లేవని..ఇంకిత జ్ఞానం లేదని విమర్శించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్లను వ్యక్తిగతంగా బ్రోకర్ అని విమర్శించడం దుర్మార్గమన్నారు. మంత్రి అమర్నాథ్ పెద్ద బ్రోకర్ అని.. తాడేపల్లి స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. మంత్రి అమర్నాథ్ భూకబ్జాలు చేస్తూ బ్రోకర్ పనులు చేస్తున్నారన్నారు. మంత్రి అమర్నాథ్ మంత్రి అయిన తరువాత పరిశ్రమలు పోతున్నాయి. ‘‘మంత్రి అమర్నాథ్ నీకు దమ్ము ఉంటే అనకాపల్లిలో గెలిచి చూపించు. నీకు ఇదే చివరి రాజకీయ జీవితం. ముఖ్యమంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి అమర్నాథ్ లే పెద్ద బ్రోకర్లు’’ అంటూ పంచకర్ల రమేష్ వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa