డిసెంబరు 26 నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం మొదలై.. 47 రోజులపాటు ఫిబ్రవరి 10 వరకు సచివాలయం, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్ధాయి వరకు కార్యక్రమం వివిధ దశల్లో జరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. డిసెంబరు 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. దీనికోసం సీఎస్ జవహర్రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్ధాయిలో గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రంలో జరగలేదు.అలాంటి కార్యక్రమాన్ని మనం తలపెట్టాం. మనం నిర్వహించే ఏ కార్యక్రమాన్ని అయినా ఒక బెంచ్మార్క్ను ఏర్పాటు చేస్తూ చేపడుతున్నాం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa