అంగన్వాడీ సంఘాలతో మంగళవారం మరోసారి ప్రభుత్వ జరిపిన చర్చలు ముగిశాయి. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 11 డిమాండ్లలో ఒకటి తప్ప 10 డిమాండ్లు ఆమోదించామని తెలిపారు. గ్రాట్యుటీ అంశం మా పరిధిలో లేదని అంగన్వాడీలకు చెప్పామని అన్నారు. వేతనాలు ఇప్పుడు పెంచలేమని, ఈ విషయంలో కొంత సమయం అడిగామని పేర్కొన్నారు. సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 15 రోజుల సమ్మెతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు.
జనవరి 3వ తేదీ తర్వాత బాలింతలకు జగనన్న కిట్లు అందించాలని, ఇందుకు సహకరించాలని అంగన్వాడీలను కోరినట్టు మంత్రి వివరించారు. సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. సంక్రాంతి తర్వాత మరోమారు చర్చలు జరుపుతామని, అంగన్వాడీ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని, మేం అంగన్వాడీలను బెదిరించడం లేదని, రిక్వెస్ట్ చేస్తున్నామని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు.
అయితే, అంగన్వాడీ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు విఫలమయ్యాయి. యథావిథిగా సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు. సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగన్వాడీ సంఘాల నేతలు ససేమీరా అంటున్నారు. మంగళవారం సాయంత్రం మంత్రుల కమిటీ.. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులను చర్చలకు పిలిచింది. దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే స్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల తరువాత జీతాల పెంపుపై యోచిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa