వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పూర్తిస్థాయి ఓటర్ల తుది జాబితాను జనవరి 22న విడుదల చేస్తామని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు అ న్నారు. వివిధ రాజకీ య పార్టీల ప్రతినిధులతో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. కొత్తగా ఓటరు నమోదు కోసం జిల్లాలో 49,649 మంది దరఖాస్తు చేసుకున్నారని, సరైన ధ్రువపత్రాలు సమర్పించని కారణంగా వాటిలో 2,492 దరఖాస్తులు తిరష్కరించినట్టు తెలిపారు. అలాగే ఓట్ల తొలగింపు కోసం 51,270 దరఖాస్తులు రాగా వాటిలో 47,327 ఓట్లను తొలగించామన్నారు. వాటిలో మృతుల పేర్లు 14,982 ఉన్నాయని, రెండు ఓట్లు కలిగిన వారు 10,040 మంది ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఇతర సవరణల కోసం వచ్చిన క్లెయిమ్ల పరిశీలన తుది దశకు చేరుకుందని, ఎన్నికల కమిషన్ సూచన మేరకు వచ్చే నెల 12వ తేదీ నాటి కి వాటిని పరిష్కరిస్తామన్నారు. అర్హత గలవారు ఇంకా ఓటుహక్కు పొందేందుకు ఫారం-6ను నేరుగా లేదా ఆన్లైన్లో ఇవ్వవచ్చని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. వాటిని పరిశీలించి సాధారణ ఎన్నికల నామినేషన్లకు పది రోజుల ముందు ప్రచురించే జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa