టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో వైసీపీలో ఆందోళన మొదలైందని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్బాబు పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ....యువగళం సభలో చంద్రబాబునాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, జనసేన అధ్యక్షులు పవన్కళ్యాణ్లు ఒకే వేదికపైకి వచ్చారు. వీరిని చూసిన వైసీపీ నాయకత్వంలో వణుకు మొదలైందన్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో 5 కోట్ల మంది ఆంధ్రులకు మేలు చేకూరుతుందన్నారు. రెండు పార్టీల పొత్తు చరిత్మాకం అన్నారు. యువగళం ముగింపు సభలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం టీడీపీ, జనసేన పొత్తులో 160 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలవడం తథ్యమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa