ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాటలకే పరిమితమైన సాధికారతను..ఆచరణలో నిజం చేశారు సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 01:01 PM

వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ..... సామాజిక సాధికారత అన్నది ఏడు దశాబ్దాల పాటుగా ఒక నినాదంగానే ఉండిపోయింది. జగనన్న ముఖ్యమంత్రి కాగానే అది ఒక విధానంగా మారింది. మాటలకే పరిమితమైన సాధికారతను..ఆచరణలో నిజం చేశారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో 25మంత్రులుంటే అందులో 17మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు. అదే వర్గాలకు చెందిన మరో నలుగురు డిప్యూటీ సీఎంలు.  ఈ తీరులో సామాజికసాధికారతను సాధించి చూపిన జగనన్నను మించిన ప్రజానాయకుడు ఇంకొకరు ఉంటారా?బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను కష్టకాలంలో ఆదుకున్న నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలి. మన కోసం, మన పిల్లల మంచి భవిష్యత్తుకోసం జగనన్న కావాలి..జగనన్నే మళ్లీ రావాలి అని ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa