వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ, నా లాంటి విద్యావంతుడునైన దళితుణ్ణి రాజ్యసభకు పంపుతున్నందుకు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వ్యాఖ్యానించారు. జగన్ మడమ తిప్పరు.. మాట తప్పరు అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దశబ్ధాల కాలంగా అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, వచ్చే నెల 1 నుంచి రూ. 3 వేల పెన్షన్ ను వృద్ధులకు అందివ్వనున్నారని వెల్లడించారు. విజయవాడలో దాదాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రూ. 500 కోట్లతో వ్యయంతో ప్రతిష్టించిన జగన్, అట్టహాసంగా ఆవిష్కరణ చేస్తుండటం దళితుల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతలకు నిదర్శనమన్నారు. జగన్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఆయన సంఘసంస్కర్తగా, రాజకీయ సంస్కర్తగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేసారు. అనకాపల్లి జిల్లాలో అన్ని సీట్లు గెలిచి సీఎం జగన్ కు కానుకగా అందిస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa