ప్రకాశం జిల్లా కనిగిరి నుంచే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 5న కనిగిరిలో చంద్రబాబునాయుడి సభను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాల న్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది, గ్రామాల్లో ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలన్నారు. అర్హూలైన వారి ఓట్లు ఓటర్ల జాబితాలో తరుచుగా పరిశీలించాలన్నారు. టీడీపీకి ఓటు వేసేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు వేములకొండ శ్రీనివాసగౌడ్, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షు లు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్రసాదరావు, యేర్వ మల్లికార్జునరెడ్డి, మెట్టు శ్రీనివాసరెడ్డి, మేకల వలరాజు, నియోజకవర్గంలోని ద్వితీయాశ్రేణినాయకులు, కస్టరు ఇన్చార్జీలు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa