చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాలను గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు నమ్మరని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. జయహో బీసీ సదస్సుపై కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక్క అని ఎలా చెప్తారు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓసీ రిజర్వుడు పదవులను కూడా ఇస్తూ.. బీసీలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని కొడాలి నాని ప్రశంసలు కురిపించారు. సీఎం వైయస్ జగన్ నాలుగు రాజ్యసభ సీట్లు బీసీలకు ఇస్తే.. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీకైనా రాజ్యసభ ఇచ్చారా..? అని నిలదీశారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం వైయస్ జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు.. 2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa