బంగాళాఖాతంలో అనూహ్యంగా భారీ మేఘాలతో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ దిశగా వస్తోంది. ఇప్పటికే దీని ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తుండగా.. ఏపీకి దిశగా పయనిస్తుండటంతో భారీ వర్ష సూచన ఉంది అని భారత వాతావరణ విభాగం చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ శ్రీలంక నుంచి .. పశ్టిమ మధ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ కోస్తాకు ప్రాంతానికి సమీపిస్తోంది. దీంతో దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, లక్షద్వీప్లో ఐదు రోజులపాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
తమిళనాడు, కేరళలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడతాయనీ, అలాగే జనవరి 8న రాయలసీమలోని కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రస్తుతం తమిళనాడులోని పలు జిల్లాల్లో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి తిరుమల కొండపై చిరు జల్లులు మొదలయ్యాయి. మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో మేఘాలు ఏర్పడగా.. ఇవి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకూ విస్తరించాయి. ఉదయం నుంచి తూర్పు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు మొదలయ్యాయి. అలాగే, మంగళవారం ఉదయం కూడా వర్షాలకు అవకాశం ఉందని, ముఖ్యంగా తిరుమలలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు, ఆదివారం ఉదయం నుంచి చెన్నైలోని అడయార్, అన్నాసాలై, వేప్పేరి, గిండి, కోయంబేడు మొదలైన చోట్ల వర్షం కురిసింది. సోమవారం కూడా చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరీలోనూ వచ్చే ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం.. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa