ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్ల గురించి మాట్లాడితే టైం వేస్ట్.. లోకేష్ ఆ మాట ఎలా అంటారు: కేశినేని శ్వేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 07:04 PM

విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత 11వ డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. తన రాజీనామా లేఖను మేయర్ రాయన భాగ్యలక్ష్మికి సమర్పించారు. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని.. ఆమోదించాలని కోరారు. తన రాజీనామా ఆమోదం పొందాక తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతానని ప్రకటించారు శ్వేత. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదని.. టీడీపీ తమను వద్దు అనుకున్నప్పుడు పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. గౌరవం లేని చోట తాము పని చేయలేమన్నారు.


జగన్ ప్రభుత్వంలో కార్పొరేటర్‌ల ప్రాణాలకు రిస్క్ అని తెలిసి పోటీ చేశారని.. ఏడాదిగా టీడీపీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ చుట్టు పక్కన ఉన్న ఒక్క పార్లమెంట్‌లో కూడా అభ్యర్థి లేరని.. విజయవాడ పార్లమెంటు‌కు అభ్యర్థి ఉంటే ఇక్కడ ఎందుకు అభ్యర్థిని మార్చాల్సి వస్తుందని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో తాము ఉన్నామన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో స్థానికంగా ముగ్గురు నాయకులు తమను ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నామని.. తమతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తిరువూరు సభకు కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్అడిగారని.. విజయవాడ పార్లమెంట్ నియోజవర్గంలో నానికి సంబంధం ఏంటి అని అడగడం ఏంటని ప్రశ్నించారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేసాక కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. కేశినేని పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి కాదని.. ఆయన మూడవ సారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని కేశినేని శ్వేత స్పష్టం చేశారు. కొందరికి విలువలు ఉండవని.. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోనన్నారు శ్వేత.


తన రాజీనామాను సమర్పించే ముందు కేశినేని శ్వేత విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌ను కలిశారు. రాజకీయంగా తనకు సహకరించినందుకు రామ్మోహన్‌ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీలో కేశినేని నాని రాజీనామాకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు శ్వేత. పార్టీకి రాజీనామా చేయకుండా ఏం మాట్లాడాలనుకోవడం లేదని.. రాజీనామా తర్వాత అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తానని తెలిపారు. గద్దే రామ్మోహన్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశానని.. అలాగే తమకు బంధుత్వం కూడా ఉందన్నారు. రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి అంశాలు వారితో మాట్లాడలేదన్నారు శ్వేత.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa