టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని కూడా చేర్చుకోవాలని సూచించానని.. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. శనివారం నాడు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... పవన్తో ఇటీవల మంగళగిరి జనసేన కార్యాలయంలో రెండు గంటలపాటు చర్చించానని తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి పది వేలకు పైగా ఓట్లు సాధించిన 60 సీట్లను మళ్లీ జనసేనకే కేటాయించాలని కోరారు. కనీసం 40 సీట్లు అయినా కేటాయించాలని నేడు జనసేన శ్రేణులు ఆశిస్తున్నాయని తెలిపారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు అన్ని అవసరాలు తీర్చగలిగే ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని సూచించానని అన్నారు. పవన్ పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరం , తాడేపల్లిగూడెం స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ధృఢంగా ఆశిస్తున్న కార్యకర్తల కోసం కనీసం రెండేళ్లు పవన్కు ముఖ్యమంత్రి స్థానం కల్పించాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa