ఏపీ హైకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఊరట దక్కింది.సంక్రాంతి కావడంతో తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకోవడానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, ఉత్తర్వులను పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
41ఏ ప్రొసీజర్ ఫాలో అవుతూ రఘురామకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలన్నారు జడ్జి. సంక్రాంతికి ఏపీకి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రమాదం ఉందని.. పోలీసులు చట్ట నిబంధనలను పాటించేలా ఆదేశించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఉత్తర్వులతో రఘురామ తన సొంత నియోజకవర్గానికి వెళ్లే అవకాశం ఉంది.
ఫిబ్రవరి రెండో వారాంతంలోగా లోక్ సభ సభ్యత్వానికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న అనంతరం మంచి రోజు చూసుకుని ఎంపీ పదవికి, వైఎస్సార్సీపీకి గుడ్ బై చెబుతానన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిలో జనసేనతో పొత్తు కలిగి ఉన్న బీజేపీ కూడా భాగస్వామిగా చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానాన్ని కోరుకునే పార్టీలో చేరుతానన్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు.
గత నాలుగేళ్లుగా నాపై ఎన్నో అక్రమ కేసులను నమోదు చేశారన్నారు ఎంపీ రఘురామ కృషణంరాజు. తనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియజేయాలని న్యాయస్థానాన్ని కోరానన్నారు. తనపై 16 నుంచి 17 కేసులు ఉన్నట్టు లెక్క చెప్పారని.. అన్నింటిలోనూ కోర్టు నుంచి స్టే పొందినట్లు చెప్పారు. ఎప్పుడు తన సొంత ఊరుకు వద్దామని అనుకున్నా.. అప్పటికప్పుడు అక్రమ కేసులను నమోదు చేస్తున్నారన్నారు. గత నాలుగేళ్లలో నాపై 153 ఏ సెక్షన్ కింద నమోదు చేసిన కేసులే ఎక్కువ ఉన్నాయన్నారు.
ఈ కేసులలో 41 ఏ నోటీసు జారీ చేయడం మినహా, పోలీసులు చేయడానికి ఏమీ లేదన్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో దిగుతానని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తన నియోజకవర్గ కేంద్రమైన, జిల్లా కేంద్రమైన భీమవరానికి బయలుదేరి వెళ్తానన్నారు. తనను మార్గ మధ్యలో కలవడానికి వచ్చిన శ్రేయోభిలాషులను , నియోజకవర్గ ప్రజలను కలుస్తూ అభివాదం చేసుకుంటూ వెళ్తానన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లుగా నియోజకవర్గానికి ఎందుకు రాలేకపోయానో ప్రజలకు వివరిస్తానని.. నియోజకవర్గానికి రాలేకపోయినప్పటికీ, ప్రజలకు అందుబాటులోనే ఉన్నానన్నారు. తన నియోజకవర్గ పర్యటన సందర్భంగా తమ పార్టీ నేతుల కొంతమంది స్థానిక కళాకారులను ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. వారి మనసు రంజింప చేసే విధంగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa