తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట దక్కనుందా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం రోజు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుకు సంబంధించి తనపై ఎఫ్ఐఆర్ సహా క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు.. అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 17ఏ ని ఉదహరిస్తూ తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ చేసి.. తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనం సృష్టించింది. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసులోనే చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా అక్కడే 52 రోజుల పాటు ఉన్నారు. తర్వాత సీఐడీ కూడా చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది. తన కేసుల విషయంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదండూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై రెండు వర్గాల వాదనల్ని అత్యున్నత న్యాయస్థానం ఆలకించింది. ఇంతలోనే చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. క్వాష్ పిటిషన్పై విచారణ ముగిసినా.. ఇంతవరకు తీర్పు రాలేదు.
సెక్షన్-17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేనిదే కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి తీర్పు వస్తుందోనని రాజకీయ వర్గాలు సహా దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa